God's of Hindu: post #129374 — TG.ME

శ్రీరామస్వామి వారి దేవస్థానం. రామతీర్థం. విజయనగరం జిల్లా.
శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీ మహాలక్ష్మి అమ్మ వారికి సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమం. జరిగింది.
శ్రీ రామచంద్ర స్వామి వారి కి ప్రాత:కాలార్చన బాలభోగం. అయిన తర్వాత శ్రావణ మాసంలో మూడో శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీమహాలక్ష్మి అమ్మ వారికి పంచామృతములు అనగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పళ్ళు రసాలతో అభిషేకం చేసి సామూహికముగా భక్తులు చే స్వయంగా శ్రీ రామచంద్ర స్వామి వారి కి పుస్పార్చన మరియు శ్రీ మహాలక్ష్మి అమ్మ వారికి కుంకుమార్చన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమములో 300 మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అందరికి ప్రసాదం అందచేశారు.. శ్రావణ శుక్రవారం సందర్బంగా శ్రీ మహాలక్ష్మి అమ్మ వారిని గాజులు తో విశేషంగా అలంకరణ చేసిరి. తర్వాత యాగశాలలో సుందరకాండ హావనం. శ్రీ రామచంద్ర స్వామి వారికి నిత్యకళ్యాణం చేసిరి.ఈరోజు శ్రావణ పౌర్ణమి విఖనస జయంతి సందర్బంగా విఖనస స్వామి వారికి అభిషేకం వైదిక సిబ్బంది చేసారి.
ఈ కార్యక్రమములో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వాహనాదికారి శ్రీ వై. శ్రీనివాసరావు గారు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు సిబ్బంది పాల్గొన్నారు.
❤1
August 28, 2026 35